Chandrababu Naidu: హైకోర్టుకు చంద్రబాబు.. ప్రయోజనం ఉంటుందా?

ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబుని సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు.

New Update
Chandrababu Naidu: హైకోర్టుకు చంద్రబాబు.. ప్రయోజనం ఉంటుందా?

ఏపీ హైకోర్టులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ కస్టడీ కి ఇస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను క్వాష్ చేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు చంద్రబాబు. నిన్ననే కస్టడీ ఆదేశాలపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది. అయితే.. నేటితో చంద్రబాబు కస్టడీ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ రేపు విచారణకు వస్తే ఎంత వరకు ప్రయోజనం ఉంటుందనే అంశంపై రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది.

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలతో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. చంద్రబాబు రిమాండ్ గడువు సైతం నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరుపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రమే చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పై ఏసీబీ జడ్జి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో పిటిషన్ దాఖలు చేసేందుకు ఏపీ సీఐడీ సిద్ధం అవుతోంది. చంద్రబాబు కస్టడీని మరో రెండు రోజులు పొడిగించాలని సీఐడీ కోరనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో జడ్జి మాట్లాడనున్నారు. చంద్రబాబు రిమాండ్ ను జడ్జి మరికొన్ని రోజులు పొడిగిస్తారా? మళ్లీ కస్టడీకి కోర్టు అనుమతిస్తారా? అన్న అంశం ఉత్కంఠగా మారింది. కోర్టు నిర్ణయం కోసం టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు నారా లోకేష్ ఢిల్లీ నుంచి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి:
TDP New Committee: టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ.. బాలకృష్ణ, లోకేష్ తో పాటు మరో 12 మందికి చోటు.. లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు