/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rajampet-jpg.webp)
రాజంపేట లోక్సభ విషయానికి వస్తే.. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇమేజ్ ఆయనకు కలిసొస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పలు ఆరోపణలు చేసి వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యారన్న టాక్ ఉంది.
రాజంపేట అసెంబ్లీలో టీడీపీ బలం పెరగడం నల్లారికి ప్లస్ పాయింట్ అవుతోంది. ఇక వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రెండు సార్లు ఎంపీగా గెలిచినా... కేంద్రం నుంచి ప్రాజెక్టులు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారన్న టాక్ ఉంది.
మిథున్రెడ్డిపై వ్యతిరేకత క్రమంగా పెరగడం ఇబ్బందిగా మారింది. పుంగనూరులో తప్పా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూటమి బలం పెరుగుతుండటం కూడా నల్లారికి అనుకూలంగా మారింది. ఓవరాల్గా బీజేపీ అభ్యర్ధి నల్లారి కిరణ్కుమార్రెడ్డి గెలుస్తారని RTV స్టడీ చెప్తోంది.