AP Elections 2024: విశాఖలో నోట్ల కట్టల కలకలం

AP: విశాఖలో కారులో నోట్ల కట్టల కలకలం రేపింది. ఆర్కే బీచ్ పాండురంగపురంలో కోటిన్నర నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదును కారులోనే ఉంచి నిందితులు పరారయ్యారు. నగదు ఎవరిదనే అంశంపై పోలీసుల ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

New Update
AP Elections 2024: విశాఖలో నోట్ల కట్టల కలకలం

AP Elections 2024: ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా భారీగా తరలిస్తున్న నగదు పట్టివేత కలకలం రేపింది. సుమారు కోటిన్నర రూపాయల నగదును తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలతో ఈ నగదు వ్యవహారం బయటపడింది. విశాఖలోని బీచ్ కు సమీపంలో గల పాండురంగపురంలో కారులో తరలిస్తున్న కోటిన్నర నగదును సి విజిల్ ఫిర్యాదుతో జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి పట్టుకుంది. ఆ కారులో నగదును గుర్తించడంతో కారు వదిలి నిందితులు పరారయ్యారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు