/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/break.png)
కడప జిల్లా జమ్మలమడుగులో హైటెన్షన్ వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఎన్నికల నేపథ్యంలో నిన్న రాత్రి మొదలైన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన పోలీసులు భద్రతను భారీగా పెంచారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతల ఇళ్ల దగ్గర హైసెక్యూరిటీ ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డికి , కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డికి, వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి 2+2 గన్మెన్లతో భద్రత పెంచారు. నిన్నటి నుంచి హౌస్ అరెస్ట్లోనే ఈ నేతలు ఉన్నారు. జమ్మలమడుగులో ఇంకా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. ఇక్కడి పరిస్థితులను ఎస్పీ స్వయంగా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. భారీగా పోలీసులు మోహరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ స్థానికుల్లో వ్యక్తం అవుతోంది.