AP Elections 2024: టార్గెట్ పవన్.. పిఠాపురంలో జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీలో ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతలతో జగన్ సమావేశమై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. మండలాల వారీగా ఇన్ఛార్జిలను నియమించనున్నారు.

New Update
AP Elections 2024: టార్గెట్ పవన్.. పిఠాపురంలో జగన్ యాక్షన్ ప్లాన్ ఇదే!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై సీఎం జగన్ (CM Jagan) ఫోకస్ పెట్టారు. పవన్ ను ఓడించాలన్న లక్ష్యంతో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు. ఇందుకోసం సీఎం క్యాంప్‌ కార్యాలయానికి ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నేతలు క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.

నియోజకవర్గ బాధయతలను ముద్రగడ పద్మనాభంతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి జగన్ అప్పగించారు. మండలాల వారీగా ఇన్ఛార్జిలను నియమించి ముందుకు సాగనుంది వైసీపీ. బీసీ, కాపు ఓట్లే టార్గెట్ గా ముందుకు సాగాలని వైసీపీ భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు