Pawan Kalyan: ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ డ్రైవ్.. డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు!

ఏపీలో కాలుష్య నియంత్రణకు స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. జిల్లాల వారీగా జల, వాయు కాల్యుష్యాలకు సంబంధించిన వివరాలు అందించాలన్నారు. ఎర్రచంద్రం అక్రమ రవాణాను అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామన్నారు.

New Update
Pawan Kalyan : పవన్‌ కు హరిరామజోగయ్య మరో లేఖ!

రాష్ట్రంలో కాలుష్య నియంత్రణపై ప్రత్యేక డ్రైవ్ చేయాలని... అందులో భాగంగా పొల్యూషన్ ఆడిట్ కచ్చితంగా చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏయే పరిశ్రమల నుంచి ఎంత కాలుష్యం విదలవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వరుసగా సమీక్షలు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ శాఖాపరమైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. శనివారం సాయంత్రం తన నివాసంలో అటవీ శాఖ అధికారులతో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అంశంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలు చర్చించారు.

రాష్ట్రంలో పొల్యూషన్ ఆడిట్ విధానంపై చర్చించారు. ప్రతీ జిల్లాలో కాలుష్యం లెక్కలు తీయాలని, జల, వాయు కాలుష్యాల వివరాలు అందించాలని ఆదేశించారు. పరిశ్రమల వారీగా కాలుష్యం వివరాలు అందించి కాలుష్య నియంత్రణకు అనుసరించాల్సిన విధానాలు తెలపాలని స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి తీరాల్లో కాలుష్యం, కాగితపు పరిశ్రమల నుంచి వస్తున్న జల కాలుష్యంపైనా చర్చించారు. ఈ రెండు జీవ నదుల శుద్ధీకరణపైనా దృష్టి పెట్టాలని, ఈ అంశంపై కూలంకషంగా సమీక్షించాలని పవన్ కల్యాణ్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నేపాల్ లో 172 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం
ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టడానికి టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని తెలిపారు. ఇక్కడి నుంచి స్మగ్లర్లు తరలించిన ఎర్ర చందనం నేపాల్ దేశంలోని భద్రత సిబ్బందికి పట్టుబడిందనీ... ఆ ఎర్ర చందనం పరిమాణం 172 మెట్రిక్ టన్నులు అని అధికారులు వివరించారు. అక్కడ ఉన్న మన ఎర్ర చందనాన్ని ఇక్కడికి తీసుకువచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాలని, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎర్ర చందనం పట్టుబడి ఉందో కూడా తెలియచేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు