ఈ రోజు అమరావతి ప్రాంతంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జగన్ ప్రభుత్వం అమరావతిపై వ్యవహరించిన తీరుపై ఫైర్ అయ్యారు. ఈ ప్రాంతంలో వైసీపీ విధ్యంసం చేసిందన్నారు. గత ఐదేళ్ళలో అమరావతిలో అంగుళం పని కూడా జరగలేదన్నారు. పైగా విచ్చలవిడిగా పనిగట్టుకుని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి పరిస్థితి చూస్తే బాధేసిందన్నారు.
రాజధాని నిర్మాణ సామాగ్రిని ఎత్తుకెళ్లిన వాళ్ల నుంచి.. ఈ ప్రాంతంలో రౌడీయిజం చేస్తున్న వాళ్ళ వరకూ ఎవరినీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అలాంటి వారిని నిర్మొహమాటంగా అణిచివేస్తామన్నారు.అమరావతి కోసం ప్రజలు 1631 ఉద్యమం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.
ఇందులోని అంకెలను కలిపితే 11 అని.. వైసీపీకి వచ్చిన సీట్లు కూడా అంతే అన్నారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నారు. అలాంటి విధ్వసం చేసిన వైసీపీకి ఈ 11 ఇవ్వడం కూడా కరక్టేనా? కాదా? అన్న అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాలకు అర్హత ఉందా అన్న అంశంపై చర్చ జరగాలన్నారు.