Chandrababu: అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు.. వారిని దూరం పెట్టనున్న ప్రభుత్వం..!

పాలనలో సీఎం చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టిన చంద్రబాబు.. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు.

New Update
Chandrababu: అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు.. వారిని దూరం పెట్టనున్న ప్రభుత్వం..!

Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. టీటీడీ ప్రక్షాళనతో పనిమొదలు పెట్టిన చంద్రబాబు.. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు. అన్ని విభాగాల్లోనూ మార్పులు, చేర్పులకు సీఎం కసరత్తు చేస్తున్నారు. సమర్థులైన అధికారులకు మాత్రమే కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారు.

Also Read: పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.!

వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు ఉన్న వారిని టీడీపీ ప్రభుత్వం దూరం పెట్టనుంది. ప్రక్షాళన విషయంలోనూ చంద్రబాబు మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. 5 హామీలపై వాటి అమలుపై వేగంగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. నిర్ణయం తర్వాత జాప్యం ఉండకూడదని అధికారులకు సూచినలు ఇస్తున్నారు.

Also Read: మంగళగిరి ప్రజల కోసం మంత్రి లోకేష్ ప్రజా దర్బార్

పాలనపై కొత్త ప్రభుత్వం మార్క్ ఉండాలని హెచ్చరించారు.  పాలనలో మార్పు కనిపించాలంటున్నారు. మరోవైపు పార్టీకి, క్యాడర్‌కు సమయం ఇచ్చేలా ప్రణాళిక చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా అందుబాటులో ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు