Accident : తిరుపతిలో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా టైర్ పేలడంతో..

బెంగళూరు-తిరుపతి రోడ్డుపై నిన్న బస్సు, రెండు లారీలు ఢీకొనడంతో 8 మంది మృతి చెందిన ఘటన మరవకముందే.. అదే మార్గంలో మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇన్నోవా టైర్ పేలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అరగొండ దగ్గర ఈ ప్రమాదం జరిగింది.

author-image
By Nikhil
New Update

Tirupati :

చిత్తూరు జిల్లాలో ఈ రోజు మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైరు పేలడంతో ఓ ఇన్నోవా కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. బెంగళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అరగొండ దగ్గర బెంగళూరు-చెన్నై హైవే బ్రిడ్జిపై ఈ ప్రమాదం జరిగింది. నిన్న ఇదే రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదంలో బస్సు, రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి, 33 మందికి తీవ్ర గాయలయ్యాయి. రెండు లారీల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. తీవ్రగాయాలన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోడ్డుపై వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండడంతో ఈ మార్గంలో వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు