ఎమోషనల్ పోస్ట్ తో కోహ్లీకు విషెస్‌ తెలిపిన అనుష్క శర్మ.!

కోహ్లీ బర్త్ డే సందర్భంగా తన భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. కోహ్లీ ప్రాముఖ్యతను చెబుతూ.. భర్తపై తనకున్న ప్రేమను చాటుకుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ భావోద్వేగంతో విషెస్ తెలిపింది.

New Update
ఎమోషనల్ పోస్ట్ తో కోహ్లీకు విషెస్‌ తెలిపిన అనుష్క శర్మ.!

Anushka sharma and Virat kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేడు 35వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా విరాట్‌కు ప్రముఖులతోపాటు అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. కోహ్లీతో తమకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనుష్క శర్మ కూడా తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

publive-image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఇన్ స్టా వేదికగా తన భర్త ఉన్న ప్రేమను చాటుకుంది. హ్యాపీ బర్త్ డే  అని ఫార్మల్ గా విషెస్ చెప్పకుండా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. క్రికెటర్ గా కోహ్లీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. అతడిపై తనకున్న ప్రేమకు వెల్లడించింది.

publive-image

తన జీవితంలో కోహ్లీ ప్రాముఖ్యతను చాటిచెబుతూ.. జీవితమంతా తననే ప్రేమిస్తానంటూ అనుష్క ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. కోహ్లీ నిజంగా అసాధారణమైన వ్యక్తి అని కితాబిచ్చింది. కొడుకుగా, భర్తగా, తండ్రిగా.. అన్ని పాత్రలలోనూ అసాధారణమేనంటూ పొగిడింది. ఈ జన్మంతా.. ఆ తర్వాత కూడా నీపై నాకున్న ప్రేమకు అంతులేదంటూ అనుష్క పేర్కొంది.

publive-image

అలాగే అనుష్క శర్మ ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను కూడా అభిమానులతో పంచుకుంది. ఆ పోస్ట్ కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డుకు సంబంధించినది కావడం విశేషం. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన ఏకైక బౌలర్ విరాట్ కోహ్లీ అని ఆ పోస్టులో ఉంది. ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ వార్తా సంస్థ రాసిన వార్తను పోస్ట్ చేసింది.

2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భాగంగా పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ తొలి సారి బౌలింగ్ చేశాడు. వేసిన మొదటి బంతి వైడ్ వెళ్లింది. కానీ ఇంగ్లండ్ బ్యాటర్ పీటర్సన్ ముందుకెళ్లి ఆడే ప్రయత్నంలో భాగంగా క్రీజు దాటాడు. వెంటనే వికెట్ కీపర్ ధోని బంతి అందుకుని స్టంపింగ్ చేశాడు. దీంతో అలా కోహ్లీ ఒక బంతి కూడా వేయకుండానే వికెట్ తీసిన బౌలర్‌గా అరుదైన రికార్డును సాధించాడు.

publive-image

కాగా, కింగ్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులకు 2017లో పెళ్లి జరిగింది. వీరికి 2021 జనవరిలో ఓ కూతురు పుట్టింది. ఆ కూతురి పేరు వామిక. అయితే గత నెలలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో గౌహతి నుంచి ముంబైకి వెళ్లాడు. దీంతో కోహ్లీ, అనుష్క దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

publive-image

ఇక ప్రస్తుత ప్రపంచకప్‌‌లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఇప్పటికే 48 సెంచరీలు బాదిన కోహ్లీ.. మరొక సెంచరీ బాదితే 49వ సెంచరీ అవుతుంది. దీంతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేస్తాడు.

Also Read: అందుకే హీరోయిన్ కాలేకపోయాను.!

Advertisment
తాజా కథనాలు