INDIA alliance: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియా కూటమి

ఇండియా కూటమి మొదటి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.

New Update
INDIA alliance: మరో కీలక నిర్ణయం తీసుకున్న ఇండియా కూటమి

INDIA alliance: ఇండియా కూటమి మొదటి సమన్వయ కమిటీ సమావేశం ఢిల్లీలో బుధవారం రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్ లో ఇండియా కూటమి తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి మొత్తం 12 మంది నేతలు హాజరయ్యారు. ఈడీ సమన్లు జారీ చేయడంతో సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ హాజరు కాలేకపోయారు.

ఈ సందర్భంగా దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, కుల గణన, బీజేపీ అవినీతి పాలన వంటి అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి ఇండియా కూటమి సారించింది. విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని కూటమి సభ్యులు అభిప్రాయపడ్డారు. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్వామ్య పక్షాల చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయించారు. పార్టీల మధ్య సీట్ల పంపకం, రాబోయే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పట్నా, బెంగళూరు, ముంబయి, ఢిల్లీ మీటింగ్స్ తర్వాత తొలిసారి కూటమి సమన్వయ కమిటీ సమావేశం ఇది. ముంబయి వేదికగా I.N.D.I.A కూటమి మూడోసారి సమావేశమైనప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఎటువంటి భేషాజాలకు పోకుండా ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్తేనే బీజేపీని ఢీకొట్టగలమని భావిస్తున్న కూటమి నేతలు ఈ సారి బలమైన అభ్యర్థులనే పోటీలో నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జరుగుతున్న మొదటి సమన్వయ కమిటీ సమావేశంలో సీట్ల షేరింగ్ మీదే ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.పార్టీలకతీతంగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పోటీకి నిలబెట్టడానికి ఈ సమావేశం జరుగుతోంది.

కూటమిలో ఏ నిర్ణయం అయినా ఈ కమిటీనే తీసుకుంటుంది. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తుకు వెళ్తారన్న వార్తల నేపథ్యంలో వీలైనంత తొందరగా అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని I.N.D.I.A కూటమి భావిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లో అభ్యర్థుల కేటాయింపు దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ, పంజాబ్, వెస్ట్ బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లోని సీట్ల పంపకమే సమన్వయ కూటమికి సవాలుగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, డీఎంకే పార్టీ నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నుంచి తేజస్వి యాదవ్ సమన్వయ కూటమిలో ఉన్నారు. హేమంత్ సోరెన్ (జేఎంఎం), సంజయ్ రౌత్ (శివసేన-యూబీటీ), రాఘవ్ చద్దా (ఆప్), జావేద్ అలీ ఖాన్ (ఎస్పీ), లాలన్ సింగ్ (జేడీయూ), డీ రాజా (సీపీఐ), ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), అభిషేక్ బెనర్జీ (టీఎంసీ) సభ్యులుగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: సనాతన ధర్మాన్ని నాశనం చేసేందుకే ఇండియా కూటమి ఏర్పడింది..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు