ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. గత కొన్నాళ్లుగా అక్కడ రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ హింసకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. తాజాగా బుధవారం రాత్రి కూడా మరోసారి హింస చెలరేగింది. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని నార్త్ బోల్జాంగ్లో గురువారం ఉదయం 5 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు, అస్సాం రైఫిల్స్ సిబ్బంది మధ్య కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతంలో పరిస్థితి అదుపులో ఉందని, కాల్పులు జరిపినవారిని పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..మణిపూర్లో చల్లారని హింస, నిరసనకారులు, ఆర్మీ మధ్య కాల్పులు..!!
ఈశాన్యరాష్ట్రమైన మణిపూర్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. తాజాగా మరోసారి హింస చెలరేగింది. నిరసనకారులు, ఆర్మీ మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉందని కాల్పులకు తెగబడిన దుండగులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రం ఇంఫాల్ తూర్పు జిల్లాలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు.
Translate this News: