కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని వ్యక్తి వాలంటీర్ల వ్యవస్థల గురించి తెలుసుకోకుండా అనాలోచిత ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి రోజా హెచ్చరించారు. వెంటనే వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఏపీలో 15వేల పైచిలుకు గ్రామ పంచాయతీలుంటే రెండు లక్షల 60వేల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. వీరిలో సగం మంది మహిళా వాలంటీర్లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మీ ప్రభుత్వం వచ్చిన రోజుల్లో నిరంతరంగా నీ మీద ఈనాడు, టీవి5, టీడీపీ ఛానళ్లలో టెలీకాస్ట్ చేశారని వాపోయావు కదా ఇప్పుడేం అయ్యిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..పవన్ వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
ఏపీలో 30వేల మంది మహిళలు మాయమయ్యారని దీనికి వాలంటీర్లే కారణమని జనసేన అధినేత పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను వాలంటీర్లు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించడం దారుణమని దుయ్యబట్టారు. వాలంటీర్ల గురించి తెలియని పవన్ కల్యాణ్ రాజకీయ స్వార్థం కోసం ఇష్టమొచ్చినట్లు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: