Crime News: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!

చిత్తూరు జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడు గగన్‌తో కలిసి భర్త వెంకట శివను భార్య రమణమ్మ హత్య చేసింది. ఏడాదిగా రమణమ్మ గగన్‌ అనే యువకుడితో పాటు బషీర్‌ అనే మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. గగన్‌తో కలిసి రమణమ్మ తన ఇంట్లోనే ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు వెంకటశివ. దీంతో అతడిని రోకలిబండతో కొట్టి చంపేశారు.

Crime News: ఇద్దరు ప్రియులు.. బలైన మొగుడు.. భర్తను చంపి భలే స్టోరీ అల్లిందిగా!
New Update

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. చిన్నారులను అనాధలుగా మారుస్తున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా నిత్యం ఎక్కడో అక్కడో ఎవరో ఒకరు బలైపోతున్నారు. తమ బంధాలకు అడ్డు వస్తున్నారన్న కారణాలతో హత్యలు చేసుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటన చూస్తే ఈ విషయం మరోసారి స్పష్టమవుతుతోంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏకంగా భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య ఉదంతమిది.

ఇద్దరి ప్రియులతో సహజీవనం:

పీలేర్ నియోజక వర్గం, కలకడ మండలం సింగన ఒడ్డుపల్లికి చెందిన వెంకట శివ రమణమ్మ దంపతులు బతుకుదెరువు కోసం ఏడాది క్రితం మదనపల్లికి వచ్చి స్థానిక టమాటా మార్కెట్లో కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. పట్టణంలోని నీరుగట్టువారి పల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో రమణమ్మకు ఇంటి పక్కనే ఉన్న గగన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అలాగే షేక్ బషీర్ అనే వ్యక్తితో కూడా ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. ఈ ఇద్దరు ప్రియులతో రమణమ్మ సహజీవనం చేస్తుండేది. ఏడాదిగా ఇది కొనసాగుగుతుండగా... ఆదివారం రాత్రి ఇంటికి వచ్చిన వెంకట శివ అతని భార్య గగన్‌లో కలిసి ఉండడాన్ని చూసి ఆగ్రహించాడు.

This browser does not support the video element.

రోకలిబండతో కొట్టి చంపారు:

రమణమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు వెంకటశివ. గగన్‌ గురించి నిలదీశాడు. దీంతో రగిలిపోయిన రమణమ్మ, గగన్‌ ఇద్దరు కలిసి వెంకట శివ తలపై రోకలిబండతో కొట్టారు. అంతేకాకుండా గగన్ అక్క బిందుప్రియ సహాయంతో వెంకట శివ మెడకు తాడు చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య రమణమ్మ .. తన భర్త మద్యం సేవించి కిందకు పడి తలకు బలమైన గాయం తగిలించుకొని ఇంటికి వచ్చాడని, ఎవరు కొట్టారో ఏమైందో తనకు తెలియదని స్టోరీ అల్లింది. హాస్పిటల్‌కు తీసుకెళ్దాం అనుకునే లోపే ప్రాణాలు విడిచారని, వెంకట శివ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వెంకట శివ మృతదేహాన్ని ఒక ఆటోలో సింగనా వడ్డిపల్లికి తీసుకెళ్లగా, అక్కడ అతని బంధువులు మృతదేహంపై గాయాలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఎంక్వైరీలో తేలిన నిజాలు:

మదనపల్లి వన్ టౌన్ సిఐ మహబూబ్ బాషా అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి తీసుకొచ్చారు. పోస్టుమార్టం తర్వాత పోలీసులు ముమ్మాటికి ఇది పథకం ప్రకారం చేసిన హత్య అని డిసైడ్ అయ్యారు. రమణమ్మను పోలీసులు విచారించగా..అసలు నిజం బయటపడింది. రమణమ్మ చెప్పిన విషయాలు చూస్తే పోలీసులే అవాక్కైనట్లు తెలిపారు. 20 గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు రమణమ్మ, గగన్, బిందుప్రియ లను అరెస్టు చేశారు. షేక్ బషీర్ భాష పరారీలో ఉన్నట్లు డి.ఎస్.పి కేశప్ప చెప్పారు.

Also Read: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..!

#extramarital-affairs #ap-crime-news #chitoor-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe