/rtv/media/media_files/2024/10/27/oTnJYYXYntlT0QwGESKd.jpg)
Jagan: వైసీపీ అధినేత జగన్ కు ధర్మాన షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ధర్మాన కొడుకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జనసేనలో ధర్మాన ప్రసాదరావు కొడుకు చేరుతారని ప్రచారం జోరందుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు.. ఇటీవల ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. టీడీపీలో చేరేందుకు ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యనేతలతో చర్చలు జరిపినట్లు టాక్ నడుస్తోంది. కాగా.. ఇప్పుడు జనసేనలోకి ఆయన కొడుకు రామ్ మనోహర్ నాయుడు చేరుతారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే జనసేన నేతలతో మనోహర్ నాయుడు కీలక చర్చలు జరిపినట్లు సమాచారం. పార్టీ మారుతారనే ప్రచారాన్ని వారు ఖండించకపోవడంతో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.