శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం... క్లారిటీ ఇచ్చిన TTD

తిరుమల లడ్డులో పొగాకు ప్యాకెట్ వచ్చిందంటూ వైరల్ అవుతున్న వార్తలపై టీటీడీ స్పందించింది. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో తయారు చేస్తారని తెలిపింది.

author-image
By Nikhil
TTD
New Update

తిరుపతి శ్రీవారి లడ్డూలో వినియోగించే నెయ్యిని కల్తీ చేశారంటూ ఇటీవల సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ వార్తలపై భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి విచారణ చేసి వాస్తవాలు తేల్చాలని భక్తులు కోరుతున్నారు. నిజంగా కల్తీ జరిగినట్లు తేలితే దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో ఈ అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య నిత్యం ఈ కల్తీ లడ్డూ వ్యవహారంపై మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు టీటీటీ ఆలయశుద్ధి సైతం చేసింది. 

అదంతా ఫేక్..

ఇదిలా ఉంటే.. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం వచ్చిందన్న వార్త నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంత మంది భక్తులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో శ్రీవారి లడ్డూల నాణ్యతపై మరోసారి భక్తుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీటీ స్పందించింది. ఇదంతా దుష్ప్రచారం అని కొట్టిపారేసింది. లడ్డూలను వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో తయారు చేస్తారని తెలిపింది. ఈ లడ్డూ తయారీ ప్రక్రియను 360 డిగ్రీల సీసీ టీవీ నిఘాతో క్షుణ్ణంగా పర్యవేక్షిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరింది టీటీడీ.  

#ttd
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి