Tangirala Sowmya : లాసెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

ఏపీలో వెలువడిన లాసెట్ ఫలితాల్లో ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రతిభ చూపించారు.  మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు సాధించారు.  దీంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుత్తున్నారు.

New Update
AP Lawcet 2025 Results

ఏపీలో వెలువడిన లాసెట్ ఫలితాల్లో ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ మహిళా ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రతిభ చూపించారు.  మొత్తం 95 మార్కులు సాధించి 739వ ర్యాంకు సాధించారు.  దీంతో ఆమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుత్తున్నారు.  తన తండ్రి తంగిరాల ప్రభాకరరావు లాయర్ గా చాలామందికి సేవలందించారని ఆయన బాటలోనే తాను కూడా లా చదవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు.

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా

వాస్తవానికి తంగిరాల సౌమ్య చదివింది బీటెక్. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశారు. అయితే ఆమె తండ్రి అకస్మి్క మరణంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. సౌమ్య నందిగామ నుండి 2014లో జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసనసభ్యురాలుగా రికార్డు సృష్టించింది. 2019లో ఆమె ఓడిపోగా 2024లో తిరిగి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.  

95శాతం ఉత్తీర్ణత

ఏపీ లాసెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ గురువారం మధ్యాహ్నం రిలీజ్ చేశారు. ఈ ఫలితాల్లో 95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లుగా ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. టాపర్లుగా మరోసారి అమ్మాయిలే సత్తా చాటారని ప్రశంసించారు. ఈ పరీక్షకు మొత్తంగా 27,253మంది దరఖాస్తు చేసుకోగా 20,826మంది అర్హత సాధించారు.  ఈ పరీక్షలో విజయం సాధించిన అందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా జూన్‌ 5న ఏపీ లాసెట్‌-2025ను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు