Annamayya Dist:బస్సును ఢీకొట్టిన సిమెంట్‌ లారీ..30 మంది ప్రయాణికులు..!

అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సును సిమెంట్‌ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.వేలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్‌ లోడ్‌ తో వెళ్తున్న లారీ అతి వేగంతో ఢీకొట్టింది.

New Update
 బస్సును ఢీకొట్టిన సిమెంట్‌ లారీ

Annamayya District:  అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును సిమెంట్‌ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. రామాపురం మండలం మేదరపల్లి చెక్‌పోస్ట్‌ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. 

వేలూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న సూపర్‌ లగ్జరీ బస్సును కడప నుంచి రాయచోటి వైపు సిమెంట్‌ లోడ్‌ తో వెళ్తున్న లారీ అతి వేగంతో ఢీకొట్టింది. సమాచారం అందుకున్న రామాపురం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను కడప, రాయచోటి ప్రభుత్వ ఆస్పుత్రులకు తరలించారు.

రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాలతో కడప-రాయచోటి మార్గంలో ట్రాఫిక్‌ ఆగిపోయింది. జేసీబీ సహాయంతో వాహనాలు తొలగించి రాకపోకలను పోలీసులు పునరుద్దరించారు.

Also Read: Vinayaka Sobha Yatra: గణేశ్‌ శోభాయాత్ర రూట్‌ మ్యాప్‌ ఇదే…ఫాలో అయిపోండి మరి!

Advertisment
తాజా కథనాలు