AP News: కుటుంబ సభ్యుల వేధింపులతో గర్భిణీ ఆత్మహత్య

పశ్చిమగోదావరి జిల్లాలో పాలకొల్లు (మం) భగ్గేశ్వరంలో 6 నెలల గర్భిణి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితమే జనార్ధన్, దేవి ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం అత్తమామలు, భర్త వేధించడంతోనే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

New Update

AP News: నేటికాలంలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజూరోజుకు పెరిగిపోతున్నాయి. వారసుడు కావాలంటూ కొందరు, అదనపు కట్నం కోసం మరికొందరు కిరాతకులు తమ భార్యల ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. వివరాల్లో వెళ్తే.. పాలకొల్లు మండలం భగ్గేశ్వరానికి చెందిన జనార్దన్, దేవి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. అయితే.. కొన్ని రోజులుగా అత్తామామలు, భర్త తమ బిడ్డ దేవిని అదనపు కట్నం కోసం వేదిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగలోకి దిగిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

#ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe