BIG BREAKING: మంత్రి, ఎమ్మెల్యేపై లోకేష్ సీరియస్.. వివరణ ఇవ్వాలని ఆదేశం!

మంత్రి పార్ధసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ తో కలిసి పాల్గొనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

New Update

మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషపై టీడీపీ హైకమాండ్ సీరియస్‌ అయ్యింది. నూజివీడు నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషతో పాటు ఆయన కూడా వేదికపై ఉన్నారు. దీంతో జోగి రమేష్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం నారా లోకేష్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది. కార్యక్రమం వివరాలను ఆయన నేరుగా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

వివరణ ఇవ్వాలని ఆదేశం..

గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత ఎలా పాల్గొన్నారంటూ? మంత్రి ఎమ్మెల్యేపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని మంత్రి పార్థసారథి, గౌతు శిరీషను లోకేష్ ఆదేశించినట్లు సమాచారం. 

Advertisment
తాజా కథనాలు