మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం.. ఆస్తి పన్ను బకాయిదారులకు 50 శాతం రాయితీ

ఏపీ మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.  ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.  ఈ నెలఖారు వరకు ప్రాపర్టీ టాక్స్ పై పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ మార్చి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

New Update
ap  municipal

ఏపీ మున్సిపల్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను బకాయిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.  ఈ నెలఖారు వరకు ప్రాపర్టీ టాక్స్ పై పెండింగ్ లో ఉన్న వడ్డీ బకాయిల్లో 50 శాతం రాయితీ ఇస్తూ మార్చి 25వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, కొన్నేళ్లుగా పేరుకు పోయిన కోట్లాది రూపాయల ఆస్తి పన్ను వసూళ్ల కోసం వడ్డీ రాయితీ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. కాగా ఇప్పటికే తెలంగాణలో జీహెచ్‌ఎంసీ పరిధిలోనూ ఈ తరహా స్కీమ్‌ తీసుకొచ్చింది. తాజాగా ఏపీ సర్కార్‌ కూడా వడ్డీ రాయితీని ప్రకటించి చెల్లింపు దారులకు కొంత వరకు ఉపశమనం కలిగించే ప్రయత్నం చేస్తోంది.  పేరుకుపోయిన మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరం ముగింపులో కొన్నిసార్లు ప్రభుత్వాలు ఇలాంటి తరహా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాయి

Advertisment
తాజా కథనాలు