Sankranthi: కోడి పందెం వేసాడు.. కోటీశ్వరుడు అయ్యాడు.. ఈ సంవత్సరం ఇదే టాప్!

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి కోడిపందేలు జోరుగా జరిగాయి. రాజమండ్రికి చెందిన రమేష్ గెలుపు సాధించి రూ.1.53 కోట్లు వసూలు చేసుకున్నాడు. ఇది ఈ ఏడాది జిల్లాలో అత్యంత భారీ పందెం అని స్థానికులు పేర్కొన్నారు.

New Update
Sankranthi

Sankranthi

Sankranthi: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సంక్రాంతి పండగ కోడిపందేలు జోరుగా జరిగాయి. పండగ రెండో రోజు కోడిపందెల ద్వారా లక్షల రూపాయలు చేతులు మారాయి..

పైబోయిన వెంకటరామయ్య బరిలో నడిచిన పందెలలో గుడివాడ ప్రభాకర్, రాజమండ్రి రమేష్ కోళ్ళ మధ్య భారీ పోటీ జరిగింది. ఈ పందెల్లో రాజమండ్రి రమేష్ విజేతగా నిలిచి రూ.1.53 కోట్లు గెలుచుకున్నాడు.

స్థానికుల ప్రకారం, పశ్చిమగోదావరిలో ఈ ఏడాది ఇది అత్యంత భారీ కోడిపందెం. పందెం గెలిచే అవకాశాలను పెంచుకోవడానికి సరైన సమయం, జాతకం, ముహూర్తం చూసి కోళ్ళను బరిలో పెడుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో కోడిపందెలు జనాలకు మంచి వినోదంగా మారుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు