కడపలో హైడ్రా తరహా కూల్చివేతలు.. వైసీపీ నేతకు బిగ్ షాక్!

AP: కడపలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కాల్వను ఆక్రమించి వైసీపీ కార్పొరేటర్ చేసిన లే అవుట్‌ను అధికారులు కూల్చివేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కులుస్తున్నారని వైసీపీ శ్రేణులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

KADAPA
New Update

Kadapa:

కడపలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.  వైసీపీ కార్పొరేటర్ లే అవుట్ ను అధికారులు కూల్చివేస్తున్నారు. కాల్వను ఆక్రమించారని ఫిర్యాదులు రాగ అధికారులు కూల్చివేత పనులను ప్రారంభించారు. కూల్చివేతను వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అధికారులు, వైసీపీ కార్యకర్తల నడుమ తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తారా? అని  అధికారులను వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. భారీగా వైసీపీ నేతలు రావడంతో  అక్కడ టెన్షన్‌  వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు కూల్చివేతల దగ్గరకు చేరుకొని పరిస్థితి అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి