రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబు గారిపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారని మంత్రి నారాలోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు కాలం గడిపారన్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ సభలో మాట్లాడుతూ.. అమరావతి అన్నందుకు అనాడు రైతులకు సంకెళ్లు వేసారు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు మహిళా రైతుల్ని పోలీసుల బూటు కాలితో తన్నించారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగిందన్నారు. 270 మంది రైతులు చనిపోయారన్నారు. 3 వేల మంది పై అక్రమ కేసులు పెట్టారన్నారు. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అని అన్నారు. 1631 రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాన్నారు.
పాకిస్థాన్ గీత దాటింది… అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేల పై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. #AmaravatiRestart#MODI4Amaravati#AmaravatiTheRise#AndhraPradesh pic.twitter.com/tnt8UlZx88
— Telugu Desam Party (@JaiTDP) May 2, 2025
వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ ఖాయం!
పాకిస్థాన్ గీత దాటింది… అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసిందని ఫైర్ అయ్యారు. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేదన్నారు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ మన నరేంద్ర మోదీ అని అన్నారు.