Andhra Pradesh: దేశంలోనే అత్యధికంగా మహిళలపై దాడులు జరిగిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని, ఇందుకు కారణం వైసీపీ(YCP) ప్రభుత్వం అని తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ(TDP) నాయకురాలు వంగలపూడి అనిత(Anitha). మంగళవారం మీడియాతో మాట్లాడిన అనిత.. పొట్ట చేత పట్టుకుని విశాఖ(Vizag)కు వచ్చిన ఓ దళిత కుటుంబానికి చెందిన 11 మంది చేతిలో అత్యాచారానికి గురైందన్నారు. ఇంత జరిగితే మహిళా కమిషన్ చర్యలు మాత్రం శూన్యం అని విమర్శించారు. సుమోటోగా తీసుకున్నానని అని ఆదేశిలివ్వడం మినహా వారు చేసిందేమీ లేదని విమర్శించారు. బాధిత బాలికను మహిళా కమిషన్ ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు అనిత. మహిళా హోం మంత్రి ఎక్కడ ఉన్నారని నిలదీశారు. వైసీపీ మంత్రులు సీట్లు మార్చే సరికి ముందే పదవి అయిపోయిందని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..Disha App: అదే పనిచేసి ఉంటే అమ్మాయిపై అఘాయిత్యం జరిగేదా? అనిత సంచలన కామెంట్స్..
దిశ చట్టానికి చట్టబద్ధత తీసుకురానందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు టీడీపీ నాయకురాలు అనిత. దిశ యాప్ పని చేసి ఉంటే విశాఖలో బాలికపై అత్యాచారం జరిగేదా? అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందన్నారు అనిత.
Translate this News: