తాజాగా.. మరోసారి వర్మ, జనసేనానిపై పంచులు వేశాడు. గత కొన్నిరోజులుగా పవన్.. వారాహి యాత్ర చేస్తున్న విషయం తెల్సిందే. ఈ యాత్రలో పవన్.. కొద్దిగా ఘాటు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ వ్యాఖ్యలపై వర్మ సెటైర్లు వేశాడు. ప్రస్తుతం వర్మ.. సినిమాలు తీయడం మానేసి, రాజకీయ బయోపిక్ లు తీయడం మొదలుపెట్టాడు. వర్మ తన ట్విట్టర్ లో “చివరికి రాజకీయ క్యాంపైన్లు ఇక్కడికి చేరాయి. తననుకున్న దాన్ని, ఎవరు వ్యతిరేకించినా అధికారంలోకొస్తే, పీక పిసికేసి చంపేస్తా, బట్టలూడదీసి పరిగెత్తిస్తా, చర్మం వొలిచేస్తా, లాంటి హింసాత్మికమైన బెదిరింపులు, ప్రపంచ చరిత్రలో ఏ దేశంలో హిట్లర్, సద్దాం, కింజొంగ్ ఉన్తో సహా.. ఎవరూ అనుండరని మండిపడ్డారు.
ఇంకో విషయం ఏంటంటే... అధికారంలోకి వస్తే నరికేస్తాను అంటే ఇప్పుడు అధికారంలో వున్న పార్టీ అది చేయచ్చని చెప్పడమా ? ఏది ఏమైనా ఒక ప్రజాస్వామ్య దేశంలో, తన ఫాలోవర్స్ కి డైరెక్ట్ గా ఇంత బ్రూటల్ వయోలెన్స్ ని, చెప్పడం తీవ్రవాదం కన్నా, ప్రమాదకరమైన ఆటవిక మనస్తత్వం. ఇలాంటి హింసని ఎంకరేజ్ చేస్తూ అరుస్తూ ఉంటే ఆ మీటింగ్లకు వచ్చే ఆ యువకులను భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో, పవన్ కళ్యాణ్ కే తెలియాలి.
పైగా.. ఈ వయోలేంట్ బెదిరింపులన్ని, లైవ్ మీడియా ముందు ప్రజలందరూ లివింగ్ రూమ్స్ లో, పిల్లలతో పాటు టీవిలో చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై పవన్ అభిమానులు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. నువ్వు ఇలా ట్వీట్ చేస్తుంటే.. సర్, మీరు ఇలాంటి మాటలు చెబుతుంటే, ప్రతివ్రత పరమాన్నం లాంటి మాటలు గుర్తుకు వస్తున్నాయి. నువ్వెంటి వర్మ సడెన్ గా గౌతమ బుద్దలా మారిపోయావు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.