ఏపీలో వింత వ్యాధి, ఏకంగా 70 రోజులు అలా!

ఏపీలో ఓ అరుదైన వింత వ్యాధి వెలుగు చూసింది. అదొక గులియన్-బారే సిండ్రోమ్. ఈ వ్యాధి ప్రపంచంలో అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. రాయగడకి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడగా, ఆయన్ను విశాఖకు తీసుకొచ్చారు. రోగి శరీరంలో కేవలం కళ్లు తప్ప, ఏ అవయవం కదపలేని స్థితిలో ఉన్నారు. గుండె, నాడీ కూడా 30కి పడిపోయింది.

New Update
ఏపీలో వింత వ్యాధి, ఏకంగా 70 రోజులు అలా!

andhra-pradesh-news-guillain-barre-syndrome-case-found-in-vizag

విశాఖలో తాజాగా ఓ అరుదైన వ్యాధి బయటకొచ్చింది అదే.. గులియన్-బారే సిండ్రోమ్. ఈ వ్యాధి ప్రపంచంలో అతి తక్కువ మందిలో కనిపిస్తుంది. రాయగడకి చెందిన ఓ వ్యక్తి ఈ వ్యాధి బారిన పడగా.. ఆయన్ను విశాఖకు తీసుకొచ్చారు. రోగి శరీరంలో కేవలం కళ్లు తప్ప.. ఏ అవయవం కదపలేని స్థితిలో ఉన్నారు. గుండె, నాడీ పూర్తిగా పడిపోయింది. దాదాపు ఆ వ్యక్తి చనిపోవడం ఖాయమని అనుకున్నారు. కానీ.. వైద్యులు ఓటమిని అంగీకరించలేదు. అలాంటి స్థితిలో ఉన్న ఆ రోగిని.. మెరుదైన అందించి కాపాడారు. అయితే.. ఈ ప్రాసెస్ అంత సులువుగా సాగలేదు. ఏకంగా 70 రోజుల పాటు వైద్యం అందించి.. వైద్యులు ఆ రోగిని కాపాడారు.

ఇంతకి గులియన్-బారే సిండ్రోమ్ ఏంటి?

ఇది నరాలను ప్రభావితం చేసే అరుదైన వ్యాధి. మనల్ని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచే రోగ నిరోధక వ్యవస్థే.. నరాల మీద దాడి చేసి తిమ్మిరి, బలహీనత, నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ సెన్సేషన్ త్వరగా శరీరం మొత్తం పాకి.. చివరికి పక్షవాతంకు దారి తీస్తుంది. ఈ పరిస్థితికి గల కారణాలేంటో ఇప్పటికీ తెలియదు కానీ.. చాలా మంది రోగులు శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణను గురైనట్టు తెలిపారు.

ఈ వ్యాధి రావడానికి గల కారణాలు?

శ్వాసకోశ లేదా జీర్ణశయాంతర వైరల్ సంక్రమణ తర్వాత.. ఈ వ్యాధి రోజులు లేదా వారాల వ్యవధిలో కనిపిస్తుంది. జికా వైరస్ లేదా కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తాజా నివేదికల్లో తేలింది. సాధారణంగా.. మన ఆరోగ్యంపై దాడి చేసే వైరస్‌లపై రోగ నిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. కానీ.. ఈ వ్యాధి బారిన పడినప్పుడు మాత్రం ఆ వ్యవస్థ నరాలపై దాడి చేసి.. బలహీనత, పక్షవాతం గురయ్యేలా చేస్తుంది. ఇది కాళ్ళలో జలదరింపు, బలహీనతతో ప్రారంభమవుతుంది. మెల్లగా శరీరం పై భాగాలకు వ్యాపిస్తుంది. క్రమంగా ఈ వ్యాధి శరీరం మొత్తం వ్యాపించి.. పక్షవాతంగా మారుతుంది.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Journalist Accreditation : జర్నలిస్టుల అక్రిడేషన్‌ మరో మూడు నెలలు పొడిగింపు

ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

New Update
AP Journalist Accreditation

AP Journalist Accreditation

AP Journalist Accreditation:  ఏపీ జర్నలిస్టుల అక్రిడేషన్‌ను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ చేసేంతవరకు లేదా ఆగస్టు31 వరకు ఏది ముందైతే  అప్పటివరకు పొడిగింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..

జర్నలిస్టులకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జారీ చేయాల్సిన అక్రిడేషన్‌ ను మరోసారి పొడిగిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్‌ హిమాన్షు శుక్ల  ఉత్తర్వులు జారీ చేశారు. నిజానికి అక్రిడేషన్‌ ముగిసి ఏడాది గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారటం, గతంలో ఇబ్బడిముబ్బడిగా జర్నలిస్టులకు అక్రిడేషన్లు జారీచేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్రిడేషన్‌ను పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఇది మూడోసారి.  కాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్‌గా సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాస్‌ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అక్రిడేషన్‌ కార్డుల జారీలో నూతన మార్గదర్శకాలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో అక్రిడేషన్ల జారీని పొడిగిస్తూ వస్తున్నారు. కాగా తెలంగాణలోనూ పొడిగించిన అక్రిడేషన్‌ జూన్‌ 30తో ముగియనుంది. అప్పటికైనా కొత్త అక్రిడేషన్లు జారీ చేస్తారా? మరోసారి పొడిగిస్తారా? అనే అంశంలో క్లారిటీలేదు.

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

ఏపీలో ఈ నెల 31తో గడువు ముగియ నుండటంతో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును జూన్ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కార్డుల జారీ సమయం లేదా ఆగస్టు 31, ఏది ముందైతే అప్పటి వరకు పొడిగింపు వర్తిస్తుందని డైరెక్టర్ హిమాన్షు శుక్ల పేర్కొన్నారు.. రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డుల గడువు ఈ నెలతో ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలపాటు  పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఈ పొడిగింపు జూన్‌ 1, 2025 నుంచి ఆగస్టు 31, 2025 వరకు లేదా కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యే వరకు ఉంటుందని, ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు హిమాన్షు శుక్ల తెలిపారు.

Advertisment
Advertisment