Andhra Pradesh: సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కలిశారు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం అందుతోంది.

Andhra Pradesh: సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!
New Update

Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గురువారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్న రాయుడు.. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు జరుగుతున్న నేపథ్యంలో అంబటి రాయుడు క్యాంప్ ఆఫీస్‌కు రావడం హాట్ టాపిక్‌గా మారింది. కాగా, క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అంబటి రాయుడు రాజకీయాలపై దృష్టి సారించారు. గతంలోనే సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తాను ఏ పార్టీలోనూ చేరడం లేదని ప్రకటించిన రాయుడు.. ఇప్పుడు వైసీపీ తరఫున గుంటూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:

6 గ్యారెంటీల దరఖాస్తుకు ఇవి తప్పనిసరి..!

జైలుకెళ్తేనే ఇంటి స్థలం ఇస్తారా.. ఉద్యమకారులకు పథకాలు ఎలా?

#cm-ys-jagan #ysrcp #andhra-pradesh-elections #ambati-rayudu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe