Andhra Pradesh: సీట్ల పంపకాలపై టీడీపీ-జనసేన ఫోకస్.. కాకినాడ పార్లమెంట్ ఆయనకేనా?!

ఏపీలో టీడీపీ-జనసేన స్పీడ్ పెంచాయి. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి. కాకినాడ పార్లమెంట్ సీట్ సానా సతీష్‌ బాబుకు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. సానా సతీష్‌ బాబు.. ఇటు జనసేనాని పవన్ కల్యాణ్‌కు, అటు టీడీపీ అధినేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే టికెట్ కన్ఫామ్ అంటున్నారు.

Andhra Pradesh: సీట్ల పంపకాలపై టీడీపీ-జనసేన ఫోకస్.. కాకినాడ పార్లమెంట్ ఆయనకేనా?!
New Update

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉంది. దాంతో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. ఏపీలో ఇప్పటికే అధికార పక్షం వైసీపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక చర్చలు జరుపుతుండగా.. ప్రతిపక్ష టీడీపీ సైతం దూకుడుగా వ్యవహరిస్తోంది. జనసేన పార్టీతో ఇప్పటికే పొత్తు ఖరారవగా.. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకంపై కసరత్తు చేస్తోంది. అయితే, సీట్ల పంపకం విషయంలో కాకినాడ లోక్‌సభ సీటుపై ఇంట్రస్టింగ్ చర్చ జరుగుతోంది. జనసేనకే కాకిన లోక్‌సభ సీటు కేటాయింపు జరిగినట్లు ఇరు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సీటును సానా సతీష్ బాబుకు కన్ఫామ్ అయినట్లు చెబుతున్నారు ఇరు పార్టీలకు చెందిన నేతలు. జనసేనానికి, నారా కుటుంబానికి సానా సన్నిహితుడు. యువగళం పాదయాత్రలో లోకేష్‌ వెన్నంటి ఉన్నారు సానా సతీష్‌. చారిటీ ద్వారా అనేక ప్రజా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సానా సతీష్‌బాబు. అంతేకాదు, సామాజికంగా, ఆర్థికంగానూ బలంగా ఉన్నారు సానా సతీష్ బాబు. కాగా, ఇప్పటికే టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ఉమ్మడిగా ప్రకటించనున్నాయి.

Also Read:

టీఎస్‌ఆర్టీసీ మరో గుడ్ న్యూస్.. త్వరలోనే..

అప్పుడెక్కడికి వెళ్లారు మీరంతా.. మీడియాకు రాహుల్ కౌంటర్..

#andhra-pradesh #sana-sathish-babu #andhra-pradesh-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe