Andhra Pradesh: పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్ నివాసానికి బాబు స్వయంగా వెళ్లారు. మరికొన్ని నెలల్లో ఏపీలో ఎన్నికలు ఉండగా.. వీరి భేటీలో రాజకీయంగా మరింత ఆసక్తిని రేపుతోంది.

New Update
Andhra Pradesh: రేపు భోగి మంటల కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, పవన్..

Chandrababu Meets Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ వివపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు జనసేనాని పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో.. వీరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది. కాగా, ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి భేటీలో పొత్తులకు సంబంధించి మరింత క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా? అన్న దానిపై వీరి భేటీలో చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చర్చించినట్లు సమాచారం.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న చంద్రబాబు.. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన ఆయన.. అప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. అయితే, మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇటీవలే ఏపీకి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఓవైపు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తూనే.. మరోవైపు పొత్తులపై జనసేన అధినేతతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే.. చంద్రబాబు ఇవాళ పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లి మరీ కలిశారు.

Also Read:

పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఎందుకంటే..

తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు