ఎన్నికల ముందు వరకు కొడాలి నాని ఆధిపత్యం కొనసాగిన గుడివాడ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. ఇన్నాళ్లు కొడాలి నాని ఆధీనంలో ఉన్న శరత్ థియేటర్ను యాజమాన్యం స్వాధీనం చేసుకుంది. థియేటర్లో వైసీపీ ఫ్లెక్సీలు, కొడాలి నాని ఫొటోలను తొలగించారు. ఇన్నాళ్లు శరత్ థియేటర్లోనే వైసీపీ ఆఫీస్ కొనసాగింది. ఈ థియేటర్ కేంద్రంగా కొడాలి నాని మీటింగ్లు నిర్వహించేవారు. ఈ శరత్ థియేటర్ను నాని ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే యాజమాన్యం అలర్ట్ అయ్యింది. టీడీపీ నేతల సహకారంతో శరత్ టాకీస్ను స్వాధీనం చేసుకుంది. అయితే.. ఈ శరత్ టాకీస్లో టీ-పార్టీకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హాజరు కావడం గుడివాడలో హాట్ టాపిక్ గా మారింది. శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు ఆయన ఈ టీ-పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Kodali Nani: గుడివాడలో కొడాలి నానికి బిగ్ షాక్.. ఆఫీసు స్వాధీనం!
గుడివాడలో కొడాలి నాని ఆఫీస్ అయిన శరత్ థియేటర్ ను యజమానులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన టీ పార్టీకి హాజరైన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. కొడాలి నాని, ఆయన అనుచరుల కబ్జా బాధితులందరికీ న్యాయం చేస్తానని ప్రకటించారు.
Translate this News: