Gudivada amarnath: 'రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు'? గుడివాడ అమర్నాథ్ ఫైర్

జనసైనికులు జెండా కూలీలని.. జనసేన పార్టీ ఎందుకని.. టీడీపీలో విలీనం చేస్తే మంచిదంటూ పవన్‌కల్యాణ్‌కి చురకలంటించారు మంత్రి అమర్నాథ్‌. రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని పవన్‌పై నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతమందిని చంపావ్.. ఎంతమందిని ఇబ్బంది పెట్టావ్ అని ప్రశ్నించారు అమర్నాథ్‌. ముద్రగడను కూడా చంద్రబాబు చంపాలని చూశాడని ఆరోపించారు.

New Update
Gudivada amarnath: 'రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు'? గుడివాడ అమర్నాథ్ ఫైర్

పవన్ చెప్తే కాపులు టీడీపీకి ఎందుకు ఓట్లు వెయ్యాలని ప్రశ్నించారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో పాటు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడుపైనా విమర్శలు గుప్పించారు. కాపులు టీడీపీకి ఎందుకు వెయ్యాలో పవన్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కాపుల కోసం ఉద్యమం చేస్తే పవన్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని నిలదీశారు. దొంగ పని చేసిన బాబుకి పవన్ ఎందుకు అండగా నిలబడుతున్నాడన్నారు అమర్నాథ్‌. రంగా మరణానికి కారణమైన చంద్రబాబుకి ఎందుకు మద్దతు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు.

అమర్నాథ్ ఇంకేం అన్నారంటే?

➼ నాడు హైదరాబాద్‌లో పెట్టిన కాపు సమావేశానికి పవన్‌ ఎందుకు వెళ్ళలేదు..?

➼ పవన్ చంద్రబాబుతో ఉంటే కాపులు ఎందుకు ఓట్లు వేస్తారు.?

➼ పవన్ అమ్ముడుపోయిన నకిలీ కాపు

➼ 555 కోట్లతో స్కిల్ సెంటర్ పెట్టాలన్నది ప్రాజెక్ట్

➼ ఆ ప్రాజెక్టు ఎక్కడుందో చెప్తే.. నేను రాజీనామా చేస్తా

➼ జనసైనికులు జెండా కూలీలు.. జనసేన పార్టీ ఎందుకు..?

➼ విలీనం చేస్తే మంచిది..

➼ నారా లోకేశ్‌కు గుడివాడ అమర్నాథ్ కౌంటర్

➼ చంద్రబాబుని ఈడీ, సీబీఐ చర్చకు పిలుస్తుంది

➼ లోకేశ్‌ ముందు వాటికి సమాధానం చెప్పాలి

➼ జగన్‌ చర్చకు రమ్మనడానికి లోకేశ్‌ నీ స్థాయి ఏంటి..? నీ బతుకేంటి..?

➼ అధికారంలో ఉన్న నీ తండ్రి ప్రజల సొమ్ము తినేసి అడ్డంగా దొరికిపోయాడు..

➼ దేశంలోనే 4వ ధనిక ఎమ్మెల్యే చంద్రబాబు

➼ 2 ఎకరాల నుంచి 600 కోట్లకి ఎలా ఎదిగాడు..?

➼ చంద్రబాబు అరెస్ట్ జరిగి ఇన్ని రోజులవుతున్నా.. తప్పు జరగలేదని మాత్రం చెప్పలేకపోతున్నారు..

చంద్రబాబు తప్పు చేశాడు:

స్కిల్‌ స్కామ్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు అమర్నాథ్‌. ఈ కుంభకోణంలో 13 చోట్ల చంద్రబాబు సంతకాలు చేశారని.. కొట్టాల్సిన డబ్బాంతా బాబు.. కొడుకు కొట్టేసి వాతాలు వేసుకున్నారని చురలకంటించారు అమర్నాథ్‌. ఇది కేవలం తీగ మాత్రమేనని.. అన్నీ బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు చేసిన తప్పులకి శిక్ష అనుభవించక తప్పదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేసిన పాపాలకి ఆ ఆత్మలన్నీ చంద్రబాబు చుట్టూ తిరుగుతాయన్నారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఎంతమందిని చంపావ్.. ఎంతమందిని ఇబ్బంది పెట్టావ్ అని ప్రశ్నించారు అమర్నాథ్‌. ముద్రగడను కూడా చంద్రబాబు చంపాలని చూశాడని ఆరోపించారు. రెండు జెండాలు పట్టుకొని తిరిగే బదులు పార్టీ విలీనమే మంచిదని ఎద్దెవా చేశారు.

ALSO READ: జగన్‌ సంగతి ఢిల్లీలోనే తేలుస్తా..పవన్‌ మాస్ వార్నింగ్‌..!

Advertisment
తాజా కథనాలు