Ananthapuram: అనంతలో హైటెన్షన్‌..గోరంట్ల హౌస్‌ అరెస్ట్‌!

అనంతపురం జిల్లా(Ananthapuram)లో హైటెన్షన్‌ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

New Update
Ananthapuram: అనంతలో హైటెన్షన్‌..గోరంట్ల హౌస్‌ అరెస్ట్‌!

MP Gorantla Madhav: అనంతపురం (Ananthapuram)జిల్లాలో హైటెన్షన్‌ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

‘‘జ‌గ‌న్.. నీ పుట్టుకే త‌ప్పుడు పుట్టుక‌..’’ అంటూ చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ..వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రాయదుర్గం బహిరంగ సభలో జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు అతి దారుణంగా మాట్లాడారని ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ విజయమ్మను కించపరిచారని.. చంద్రబాబు కడుపుకు అన్నం తింటున్నారా? లేదంటే ఇంకేమైనా తింటున్నారా? అంటూ ఆయన ఫైర్ అయ్యాడు. చంద్రబాబును మహిళా లోకం క్షమించదని...ముక్కు నేలకు రాసి ..వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు.లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుని తీరతామని అని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకుపోతున్నారు. వరుస పర్యటనలతో బిజీగా ఉంటున్నారు. వివిధ వర్గాల ప్రజలతో చర్చా కార్యక్రమాలు,సమావేశాలు,రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే అనంతపురం జిల్లాలో పర్యటన చేపట్టారు. గుంతకల్ నియోజకవర్గాల్లో బాబు ష్యురిటీ, భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గుత్తిలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనను కచ్చితంగా అడ్డుకుంటామంటూ ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్‌ ఇచ్చారు.

మరోవైపు ఎలాగైన చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని గుత్తి నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధీమ వ్యక్తం చేస్తున్నారు. బాబూ ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గుత్తిలో విజయవంతంగా నిర్వహిస్తామంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు గ్యారెంటీ అంటున్నారు.రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమంటున్నారు. అయితే,ఎంపీ వార్నింగ్‌తో గుత్తిలో ఉద్రిక్తత వాతవారణం నెలకొనే ఛాన్స్‌ కనిపిస్తోంది.ఎప్పుడు ఏమీ జరుగుతుందోనని ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు.

Also Read: విశాఖలో ఉదయం నుంచి కుండపోత..ఇళ్లకే పరిమితమైన నగరవాసులు!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Ap Crime News: చిటికెలో మోసం.. పెళ్లి కొడుకు బైక్‌పై వెళ్లి - ప్రియుడితో లేచిపోయిన పెళ్లికూతురు!

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.

New Update
bride ran away with her boyfriend day after her wedding

bride ran away with her boyfriend day after her wedding

ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్‌తో జంప్ అయిపోయింది. ఈ ఘటన జరిగి 5 రోజులైనా పోలీసులు చేదించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: మరో యువతితో లాలూ కొడుకు రాసలీలలు.. జీవితం నాశనం చేశారంటూ తేజ్ భార్య ఆరోపణలు!

ప్రియుడితో పెళ్లికూతురు పరార్

కెనరా బ్యాంకు ఉద్యోగి మురళికి చెన్నే కొత్తపల్లి మండలం నాగసముద్రానికి చెందిన అర్చనకు ఈనెల 22న పెద్దలు కుదిర్చి పెళ్లి జరిగింది. ఆ మరుసటి రోజే అంటే 23వ తేదీ ఉదయం నాగసముద్రం నుంచి నూతన వధువరులు బైక్‌పై ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో వధువు అర్చన తన ఫ్రెండ్‌కు హెల్త్ బాగాలేదని.. చూసిరావాలని చెప్పడంతో వరుడు మురళి కొత్త బట్టలతోనే బైక్‌పై తీసుకెళ్లాడు. 

Also Read: వారెవ్వా అదిరిపోయింది.. iQOO నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ - ఫీచర్లు హైక్లాస్!

సరిగ్గా ధర్మవరంలో ఒకసెంటర్ వద్ద బైక్ ఆపమని చెప్పి మురళి దగ్గర ఉన్న మొబైల్‌ను తీసుకుంది. ఇపుడే వస్తానని మొబైల్‌లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది. ఇక ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో మురళి వెంటనే తన మొబైల్‌కు ఫోన్ చేశారు. దీంతో ఆ మొబైల్ స్విచాఫ్ వచ్చింది. ఎంతసేపటికి రాకపోయేసరికి మురళి కంగారు పడి అర్చన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. 

Also Read: అనిరుధ్‌కు కాస్ట్‌లీ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

దీంతో వెంటనే అర్చన కుటుంబ సభ్యులు ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అప్రమత్తమై ఫోన్ ట్రాక్ చేయగా ఒక ఇంట్లోకి వెళ్లి స్విచాఫ్ చేసుకుని తన ప్రియునితో పరరైనట్టు గుర్తించారు. అర్చన తనతో ఉన్న 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు మురళీమొబైల్ ను కూడా తీసుకుని ప్రియునితో లేచిపోయినట్టు వచ్చిన పిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read: కరోనా పని ఖతం.. నో టెన్షన్.. గుడ్ న్యూస్ చెప్పిన నిపుణులు!

అర్చన కుటుంబ సభ్యులు టీడీపీ మద్దతుదార్లు కాగా.. అర్చన ప్రియుడు బీజేపీ మద్దతుదారు కావడంతో ఇరుపార్టీల స్థానిక నేతలు తమదే జరగాలని ఒత్తిడి చేస్తున్నారు. అయితే ధర్మవరం టౌన్ నడిబొడ్డున జరిగిన ఘటనపై ప్రియురాలు.. ప్రియుని ఆచూకీని పోలీసులు కనిపెట్టకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

crime news | latest-telugu-news | telugu-news | latest crime news ap | AP Crime

Advertisment
Advertisment