BREAKING: నేపాల్‌లో ఘోర ప్రమాదం

నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి మార్స్యంగ్డి నదీలో పడిపోయింది. బస్సులో 40 మంది భారతీయులు ఉన్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి

BREAKING: నేపాల్‌లో ఘోర ప్రమాదం
New Update

Nepal Accident: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో మార్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయిందని.. బస్సులో ఉన్న ప్రయాణికులు భారతీయులు అని చెప్పారు. పోఖారా నుండి ఖాట్మండు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.

ఉత్తర ప్రదేశ్ చెందిన 'UP FT 7623' నంబర్ ప్లేట్ గల బస్సు నదిలో పడి నది ఒడ్డున పడి ఉందని జిల్లా పోలీసు కార్యాలయం తనహున్ నుండి డీఎస్పీ దీప్‌కుమార్ రాయ తెలిపారు. కాగా సమాచారం ఆదుకున్న యూపీ గవర్నమెంట్.. ఈ ఘటనపై అక్కడి పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. సహాయక చర్యలపై సీఎం యోగి ఆదిత్యనాథ్ అడిగి తెలుసుకున్నట్లు యూపీ రిలీఫ్ కమీషనర్ తెలిపారు. ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

#nepal-accident
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe