ఏపీలో ఎన్నికల ప్రచారం హోరా హోరీగా సాగుతోంది. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా (Amit Shah)ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూటమి అధికారంలోకి వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక తెలుగు భాషను పరిరక్షించడం తమ బాధ్యత అని చెప్పారు అమిత్ షా. వైసీపీ సర్కారు తెలుగు భాషను నిర్వీర్యం చేసే దిశలో వెళుతోందని.. తెలుగు భాషను దెబ్బతీసేందుకే ప్రాధమిక పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనా ప్రారంభించిందని ఆరోపించిన అమిత్ షా(Amit Shah).. తెలుగు భాషను పరిరక్షించేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. గూండాగిరీ, అవినీతి అంతం చేయడానికే ఏపీలో పొత్తులు కుదుర్చుకున్నామని అమిత్ షా అన్నారు. ఏపీలో గూండాగిరీని అంతం చేస్తామని అన్నారు.
పూర్తిగా చదవండి..Amit Shah: రెండేళ్లలో పోలవరం పూర్తి.. అమరావతి రాజధాని.. అమిత్ షా కీలక హామీలు
ఏపీలో ధర్మవరంలో కూటమి అభ్యర్థుల తరపున కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి.. అమరావతి రాజధాని వంటి హామీలను అమిత్ షా ఇచ్చారు.
Translate this News: