తెలంగాణకు రానున్న అమిత్‌షా.. అనంతరం రాజమౌళితో చర్చ....

New Update

కర్నాటక ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ గెలుపు కైవసం చేసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురవేయాలని ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేసీఆర్ సర్కార్ పరిపాలనను ఎండగడుతూ ముందుకెళ్తుంది. తరచూ కేంద్ర మంత్రులు రాష్ర్టంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ.. తెలంగాణ బీజేపీ క్యాడర్ లో జోష్‌ను నింపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

publive-image

ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. బుధవారం (జూన్ 14వ తేదీన) సాయంత్రం హైదరాబాద్ కు రానున్నారు. ఈ టూర్ లో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళిని అమిత్ షా ప్రత్యేకంగా కలవనున్నారు. వీరి భేటీ ఇప్పుడు సినీవర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అనే దానిపై ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయ శంఖారావం పూరించాలనే లక్ష్యంగా ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ స్టార్ట్‌ చేశారు బీజేపీ అధిష్టానం పెద్దలు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 9ఏళ్లలో చేసిన అభివృద్ధిని మహాజన సంపర్క్‌ అభియాన్‌లో భాగంగా ఆయన ప్రజలకు, కార్యకర్తలకు వివరించనున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe