టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అమరావతి పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వెలగపూడిలో రాయుడును రాజధాని రైతులు అడ్డుకున్నారు. స్థానిక వైసీపీ నేతల విజ్జప్తి మేరకు వెలగపూడిలోని వీరభద్రస్వామి దేవాలయానికి విచ్చేశారు. విషయం తెలుసుకున్న రైతులు ఆలయం వద్దకు వచ్చారు. అమరావతికి సంఘీభావం తెలపాల్సిందిగా రాయుడును కోరారు. మీరు ఆడిన ప్రతి మ్యాచ్లో సెంచరి కొట్టాలని తామంతా కోరుకున్నామని.. తమ ఉద్యమానికి మద్దతు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జై అమరావతి నినాదం చేయాలని అడిగారు. దీంతో కంగుతిన్న రాయుడు అమరావతి ఎక్కడికి కదలదని సమాధానం దాటవేశారు. రైతుల దీక్షా శిబిరానికి రావాల్సిందిగా రైతులు కోరగా.. ఈసారి వచ్చినప్పడు తప్పనిసరిగా వస్తానని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..అంబటి రాయుడును అడ్డుకున్న అమరావతి రైతులు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. రాజధాని అమరావతి ప్రాంతం వెలగపూడిలోని వీరభద్రస్వామి ఆలయానికి దర్శనం కోసం వెళ్లారు. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు రాయుడిని అడ్డుకున్నారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేయాలని డిమాండ్ చేశారు.
Translate this News: