ఏపీలో రాజకీయాలు హాట్ హాట్గా సాగుతున్నాయి. బ్రో సినిమాలోని ఓ సన్నివేశంపై వివాదం నడుస్తోంది. సంక్రాంతికి మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ను నటుడు పృథ్వీ చేత అచ్చం అలానే వేయించారని విమర్శలు వచ్చాయి. దీంతో అంబటి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్, ఆ సినిమా ప్రొడ్యుసర్లపై ఘాటు విమర్శలు చేశారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి ‘బ్రో’ సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేయనున్నారు. ఈ క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి, కేంద్రమంత్రి షెకావత్ లను కలిశారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ చేరిన ‘బ్రో’ మూవీ రగడ.. మంత్రి అంబటి వర్సెస్ పవన్
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పవన్ కల్యాణ్ నటించిన 'బ్రో' సినిమా చుట్టూనే తిరుగుతున్నాయి. మంత్రి అంబటి రాంబాబు ఈ సినిమాలోని ఓ సన్నివేశంపై విరుచుకుపడుతున్నారు. ఏకంగా ఢిల్లీ వెళ్లి 'బ్రో' సినిమా ఆర్థిక వ్యవహారాలపై ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారు.
Translate this News: