AdiNarayana Reddy: చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని జగన్ కోరాడు.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

అసెంబ్లీ లాబీల్లో ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి కూడా కారణమని జగన్ గ్రహించాడన్నారు. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని.. జగన్ తన తల్లిని కోరాడన్నారు. అయితే, జగనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిల చెప్పేసిందన్నారు.

AdiNarayana Reddy: చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని జగన్ కోరాడు.. ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
New Update

MLA AdiNarayana Reddy: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అసెంబ్లీ లాబీల్లో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికి చెల్లి కూడా కారణమని జగన్ గ్రహించాడన్నారు. చెల్లెలు షర్మిలతో రాజీ చేయాలని జగన్ తన తల్లిని కోరాడని ఆయన తెలిపారు. అయితే, జగనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని షర్మిల చెప్పేసిందని వెల్లడించారు.

Also Read: ఏపీలో యువతి దారుణ హత్య.. ఘోరంగా కొట్టి!

త్వరలోనే వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి అరెస్టు అవుతారన్నారు. అవినాష్ అరెస్ట్ తర్వాత జరిగే కడప ఉప ఎన్నికల్లో భూపేష్‌రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఓదార్పు యాత్ర కోసం జగన్ తక్కువలో తక్కువ..14 కారణాలు వెతుక్కుంటాడని ఏ దారి దొరక్కపోతే ఓదార్చడానికి జగన్ బాధితులను సృష్టించుకుంటారని కామెంట్స్ చేశారు.

#adinarayana-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe