రిటైల్, రెస్టారెంట్ రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్స్..!

టాటా, రిలయన్స్ గ్రూప్స్ తర్వాత అదానీ గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనంగా మారుతోంది. అదానీ గ్రూప్స్ అనేక రంగాలలో విజయవంతంగా పనిచేస్తోంది.అయితే  ఈ సంస్థ తాజాగా రిటైల్,రెస్టారెంట్ రంగాలలోకి కూడా అడుగు పెట్టబోతుంది.

New Update
రిటైల్, రెస్టారెంట్ రంగాల్లోకి ప్రవేశిస్తున్న అదానీ గ్రూప్స్..!

టాటా, రిలయన్స్ గ్రూప్స్ తర్వాత అదానీ గ్రూప్ భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సమ్మేళనంగా మారుతోంది. అదానీ గ్రూప్ పోర్ట్ మేనేజ్‌మెంట్, పవర్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్, ఆయిల్ & గ్యాస్ మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో విజయవంతంగా పనిచేస్తోంది.అయితే  ఈ సంస్థ తాజాగా రిటైల్,రెస్టారెంట్ రంగాలలోకి కూడా అడుగు పెట్టబోతుంది.ఇప్పుడు రిటైల్ రెస్టారెంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టబోతున్నారు. అదానీ గ్రూప్ రియల్ ఎస్టేట్ విభాగమైన అదానీ రియల్టీ, రిటైల్  రెస్టారెంట్ సంబంధిత రంగాలలో రిక్రూట్‌మెంట్ కోసం లింక్డ్‌ఇన్‌తో సహా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రకటనలు చేసింది.

ఇటీవల ఫీనిక్స్ మాల్స్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర కల్కర్‌ను అదానీ రియల్టీ నియమించుకుంది. అదానీ గ్రూప్ మాల్స్, ఫుడ్ బిజినెస్ హెడ్‌గా రాజేంద్ర కల్కర్ నియమితులయ్యారు. అదానీ గ్రూప్ నగరాలు, విమానాశ్రయ ప్రాంతాలలో రెస్టారెంట్లు, రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తోంది, విమానాశ్రయాల సమీపంలో పెద్ద షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు , రెస్టారెంట్లు, స్పాలు మొదలైనవాటిని నిర్మించడానికి అదానీ గ్రూప్ చురుకుగా ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 160 ఎకరాలు, లక్నోలో 100 ఎకరాలు, నవీ ముంబైలో 200 ఎకరాలు, జైపూర్‌లో 17 ఎకరాలు, తిరువనంతపురంలో 2 ఎకరాల్లో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, రెస్టారెంట్లు తదితరాలను తీసుకురావాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. అదానీ గ్రూప్ కూడా ధారవిలో భారీ మాల్‌ను నిర్మించాలని యోచిస్తోందని వర్గాలు చెబుతున్నాయి.
అదానీ రియాల్టీ ఆసియాలోని అతిపెద్ద మురికివాడ అయిన ధారవిని అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా అక్కడ కార్యాలయ భవనాలు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇటీవల, అదానీ పోర్ట్స్ , స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సీనియర్ డైరెక్టర్ కరణ్ అదానీ మాట్లాడుతూ, రాబోయే ఐదు నుండి పదేళ్లలో, ఏడు విమానాశ్రయాలు, వాటి పరిసర ప్రాంతాలలో దాదాపు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని కంపెనీ యోచిస్తోందని చెప్పారు. అదానీ గ్రూప్ ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్, లక్నో, మంగళూరు, జైపూర్, గౌహతి  తిరువనంతపురంలలో విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. హర్యానాలోని గురుగ్రామ్‌లో రిటైల్ షాపులు, రెస్టారెంట్లను కంపెనీ అభివృద్ధి చేస్తోంది.

Advertisment
తాజా కథనాలు