/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/bus-1-jpg.webp)
Uttar Pradesh Bus Fire Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 11kv కరెంట్ వైర్ తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం అయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘాజీపూర్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు సుమారు 30 మంది ప్రయాణికులతో మహాహర్ పట్టణానికి వెళ్తోన్నట్లు తెలుస్తోంది.
Also Read: కాటన్ క్యాండీ, గోబీ మంచురియాపై నిషేధం.. ఎందుకంటే?
ఘాజీపూర్లో ఘోర ప్రమాదం
ఉత్తరప్రదేశ్ - ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బృందం బస్సు దగ్ధం.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలు.
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లు సమాచారం. pic.twitter.com/BJacJIBhgO
— Telugu Scribe (@TeluguScribe) March 11, 2024
మార్దా పట్టణ సమీపంలోకి రాగానే RTC బస్సు హై టెన్షన్ విద్యుత్ వైర్లను తాకింది. బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
Also Read: కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!
గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. బస్సు మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం బస్సు మంటల్లో కాలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.