ఆధార్ ను పాన్ కార్డుతో అనుసంధానం చేసుకునే గడువు నిన్న ( శుక్రవారం)తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. నిన్నటితో చివరి తేదీ కావడంతో ప్రజలు ఆన్ లైన్ లో పోటెత్తారు. దీంతో చాలా మంది చలాన్ పేమెంట్, డాక్యుమెంట్ల లింకింగ్ లో ఇబ్బందులు తలెత్తాయి. అయితే ఈ గడవును మరోసారి పెంచుతారని పలువురు భావించినప్పటికీ..ఐటీ శాఖ మాత్రం ఎలాంటి గడువును పెంచలేదు. కానీ ఓ కీలక ప్రకటన మాత్రం చేసింది.
పూర్తిగా చదవండి..ఆధార్ -పాన్ లింక్…కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ..!!
ఆధార్ ను పాన్ కార్డుతో లింక్ చేసుకునేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. ఆధార్ పాన్ అనుసంధానానికి గడువు ముగిసిన వేళ ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆధార్-పాన్ లింక్ కోసం చెల్లింపులు చేసిన తర్వాత చలాన్ డౌన్ లోడ చేసుకోవడంలో చాలా మంది యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నట్లు ఐటీశాఖ ద్రుష్టికి వెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చలాన్ కోసం చెల్లింపులు చేసిన తర్వాత ఐటీ వెబ్ సైట్లో లాగిన్ చేసి ఈ పే ట్యాక్స్ సెక్షన్లు చెల్లింపు పూర్తి అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చని ఐటీ శాఖ సూచించింది.
Translate this News: