Vizag News: పార్టీకి పిలిచి ప్రాణం తీసిన ఫ్రెండ్స్.. ఆ అమ్మాయి కోసమేనా?

విశాఖ జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది. రేవ్ పార్టీలో ఓ యువకుడిని తోటి స్నేహితులే స్విమ్మింగ్ ఫూల్ లో తోయడంతో అతను చనిపోయాడు. మృతుడిని సాయి వర్మగా పోలీసులు గుర్తించారు. అయితే, ఓ యువతి కోసం జరిగిన గొడవలోనే సాయి వర్మను హత్య చేశారని వార్తలు వస్తున్నాయి.

New Update
Vizag News: పార్టీకి పిలిచి ప్రాణం తీసిన ఫ్రెండ్స్.. ఆ అమ్మాయి కోసమేనా?

ఈ మధ్య కాలంలో రేవ్ పార్టీలంటూ పలుచోట్ల హంగామా సృష్టిస్తున్నారు యువకులు. వారి వారి సర్కిల్స్ లోని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేందుకు రేవ్ పార్టీని ప్లాన్ చేసుకుంటారు. ఫుల్ గా మందు తాగి చిందులు తొక్కుతారు. అయితే, కొన్ని సార్లు ఇలాంటి రేవ్ పార్టీలలో  చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ప్రాణాలు మీదకు తెచ్చుకుంటారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటారు.

Also Read: హైదరాబాద్‌లో దారుణం.పెళ్లైన నెలకే భార్యను చంపి..భర్త ఏం చేశాడంటే?

తాజాగా, విశాఖ జిల్లాలో ఇలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అచ్చుతాపురంలో రేవ్ పార్టీకి వచ్చిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే అతడిని క్రూరంగా హత్య చేశారు. అసలు ఏం జరిగిందంటే.. విజయనగరంలో కొంత  మంది యువతీ యువకులు రేవ్ పార్టీ చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్లుగానే రేవ్ పార్టీ చేసుకునేందుకు అచ్యుతాపురం వచ్చారు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫుల్ గా ఎంజాయి చేశారు. అంత వరకూ బాగానే ఉంది. అయితే, సడన్ గా ఓ అమ్మాయి విషయంలో యువకుల మధ్య గొడవ స్టార్ట్ అయింది.

Also Read: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన కేరళ.. అసలేమైందంటే?

మద్యం మత్తులో ఓ యువతి కోసం తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయారు. గొడవలో ఓ యువకుడిని తోటి స్నేహితులే స్విమ్మింగ్ ఫూల్‌లోకి నెట్టేశారు. దీంతో అతను మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని సాయి వర్మగా  గుర్తించారు. పార్టీలో పాల్గొన్న యువకులను, రిసార్ట్ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు అచ్యుతాపురం పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు