రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో అర్థరాత్రి మన్ ప్రీత్ సింగ్ అనే యువకుడు హంగామా సృష్టించాడు. తల్వార్ చేతులో పట్టుకుని రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురిపై దాడికి పాల్పడ్డాడు. తల్వార్ తో విచక్షణారహితంగా ముగ్గురిని పొడిచాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..అత్తాపూర్లో అర్థరాత్రి యువకుడు హంగామా..చేతిలో తల్వార్ పట్టుకుని..!!
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో అర్థరాత్రి ఓ యువకుడు హల్చల్ చేశాడు. చేతిలో తల్వార్ పట్టుకుని రోడ్డుపై నానా హంగామా చేశాడు. రోడ్డుపై వెళ్తున్న వారిపై తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో నిందితుడి ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
Translate this News: