AP: మా కడుపుకోత తీర్చండి.. RTVతో బాధిత తల్లిదండ్రుల ఆవేదన..!

తమ కడుపుకోత తీర్చే నాథుడే లేడని ప్రకాశం జిల్లా రెడ్డి నగర్‌లో బాధిత తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 సం.ల క్రితం ఆడుకుంటున్న తమ కుమారుడిని దుండగులు ఎత్తుకెళ్లారని.. నేటికి ఆ బిడ్డ ఆచూకీ దొరకడం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు.

New Update
AP: మా కడుపుకోత తీర్చండి.. RTVతో బాధిత  తల్లిదండ్రుల ఆవేదన..!

Prakasam: తమ బిడ్డ ఆచూకి తెలియాలని ఓ బాధిత తల్లిదండ్రులు RTVతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవమాసాలు మోసి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తమ కుమారుడిని 5 సంవత్సరాల క్రితం దుండగులు ఎత్తుకుపోయారని.. నేటికి ఆ బిడ్డ ఆచూకి దొరకడం లేదని కన్నీరుమున్నీరవుతున్నారు.

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం రెడ్డి నగర్ లో మేడం అశోక్ రెడ్డి దంపతులు తమ బాధను RTVతో పంచుకున్నారు. మిస్ అయిన కుమారుడు మేడమ్ అనుష్ రెడ్డి జాడకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామన్నారు. సంవత్సరాలు గడుస్తున్నా కన్నబిడ్డ జాడ ఆచూకీ తెలియడం లేదంటూ బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటిముందు ఆడుకొంటున్న చంటిబిడ్డను దుండగులు ఎత్తుకెళ్లారని.. ఈ ఘటన జరిగి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా.. నేటికి ఆచూకి మాత్రం తెలియడం లేదని వాపోతున్నారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగిన ప్రజయోజనం కనిపించడం లేదని  విలపిస్తున్నారు. కన్నపేగు కడుపుకోత తీర్చే నాథుడే కరువయ్యడంటున్నారు. తమ బిడ్డ బతికే ఉన్నాడనే ఆశతోనే బ్రతుకుతున్నామంటున్నారు మేడం అశోక్ రెడ్డి దంపతులు.

Also Read: ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త.. 8 శాతం పెంపు!

Advertisment
తాజా కథనాలు