ఎన్సీపీలో కొనసాగుతున్న ఆందోళనలు ఓ కొలిక్కి రావడం లేదు. మహారాష్ట్ర అధికార కూటమిలో చేరేందుకు అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుంచి ఎమ్మెల్యేలు రెండు వర్గాల మధ్య దాగుడుమూతల ఆటలు ఆడుతున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ ఎవరి వాదనలు వారు వినిపిస్తూ ఈసీని ఆశ్రయించారు. అయితే ఈసీ వీరి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు.
పూర్తిగా చదవండి..అజిత్ పవార్కి బిగ్ షాక్.. బాబాయ్ దెబ్బకు కొడుకు ఫ్యూజులౌట్..!!
బాబాయ్..కొడుకు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. బాబాయ్ దెబ్బకు కొడుకు గిలగిలా కొట్టుకుంటున్నాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తూ శరద్ పవార్ తన రాజకీయ మార్క్ ను చూపిస్తున్నారు. గతవారం రోజులుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అలజడి కొనసాగుతూనే ఉంది. ఎన్సీపీలో చెలరేగిన అంతర్గత తిరుగుబాటు కారణంగా మహారాజకీయాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా తిరుగుబాటులో వర్గంలో ఉన్న ఓ ఎమ్మెల్యే అజిత్ పవార్ కు హ్యాండిచ్చి శరద్ పవార్ తో చేతులు కలపడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
Translate this News: