TS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..!

మహబూబాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థికి అవమానం జరిగింది. జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో ఉపాధ్యాయుల ఆదేశంతో ఓ విద్యార్థి బట్టలు విప్పి కేవలం డ్రాయర్ పై నిల్చొని గోడకు సున్నం వేశాడు. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

New Update
TS: పాపం.. విద్యార్థి.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఘోర అవమానం..!

Mahabubabad: ఇండిపెండెన్స్ డే అంటే విద్యార్థులు చక్కగా రెడీ అయి ఎప్పుడు లేనంత సంతోషంగా, హుషారుగా స్కూల్ కు వెళ్తారు. మన దేశానికి స్వాతంత్య్రం ఎలా వచ్చింది? ఎవరెవరూ పోరాడారు? లాంటి విషయాలను ఉపాధ్యాయులు పిల్లలకు వివరిస్తారు. అయితే, ఓ ఉపాధ్యాయుడు మాత్రం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ విద్యార్థిని దారుణంగా అవమానించాడు. పనివాళ్ళతో చేయించాల్సిన పనులు విద్యార్థితో చేయించాడు.

Also Read: డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే.. షెడ్యూల్ ఇదే..!

అసలేం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లా జమాండ్లపల్లి ఎస్టీ గురుకులంలో.. సార్ చెప్పాడని ఓ విద్యార్థి బట్టలు లేకుండా గోడకు సున్నం వేశాడు. నిన్న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విద్యార్థి సంఘాలు ఆ ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులను చదివించడానికి హాస్టల్ లో పెడితే వారితో ఇలాంటి పనులు చేయిస్తారా? అంటూ మండిపడుతున్నారు. బాధ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాnr.

Advertisment
తాజా కథనాలు