Crime News: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య, ఏడుగురు పిల్లలకు తిండి పెట్టలేక..!

పాకిస్థాన్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తిండి పెట్టలేక కట్టుకున్న భార్యతో పాటు తన ఏడుగురు పిల్లలను గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హతమార్చాడు. పిల్లలందరూ 8 నెలల నుంచి 10 ఏళ్లలోపు వారు కావడంతో ఈ ఘటన అందరిని కలిచివేస్తోంది.

Crime News: పాకిస్థాన్‌లో దారుణం.. భార్య, ఏడుగురు పిల్లలకు తిండి పెట్టలేక..!
New Update

Pakistan: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను, ఏడుగురు మైనర్ పిల్లలను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలంకు చేరుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఎందుకు తన కుటుంబ సభ్యులను హత్య చేయాల్సి వచ్చిందని విచారణ చేపట్టారు.

Also Read: యుద్ధం అంచున ప్రపంచం..ఇజ్రాయెల్ దాడులకు ప్రతిఫలం అనుభవించాల్సిందేనా?

అయితే, నిందితుడు చెప్పిన సమాదానం అందరిని కలిచివేసింది. తన పిల్లలకు ఆహారం ఇవ్వలేనందున ఈ చర్య తీసుకున్నాడని పోలీసు అధికారులకు తెలిపాడు. ఆర్థిక సమస్యలతో మనస్థాపానికి గురై ఇలా చేసినట్లు నిందితుడు అంగికరించాడు. స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేస్తోంది. పిల్లలందరూ 8 నెలల నుంచి 10 ఏళ్లలోపు వారే కావడంతో స్ధానికులు విచారణ వ్యక్తం చేస్తున్నారు.

#pakistan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe