ఇడ్లీలను కొనుగోలు చేయటానికి ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య అత్యంత రద్దీగా ఉండే సమయం అని స్వీగ్గీ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోయంబత్తూర్ ముంబై వంటి అనేక నగరాల్లోని వినియోగదారులు కూడా రాత్రి భోజనం సమయంలో ఇడ్లీని ఆస్వాదిస్తారు.
ఈ 3 నగరాల్లో ఇడ్లీకి అత్యధిక డిమాండ్:
బెంగళూరు, హైదరాబాద్ మరియు చెన్నై ఇడ్లీని ఎక్కువగా ఆర్డర్ చేసే టాప్-3 నగరాల్లో నిలిచాయి. దీని తర్వాత ముంబై, పూణే, కోయంబత్తూర్, ఢిల్లీ, వైజాగ్, కోల్కతా మరియు విజయవాడ ఉన్నాయి. అన్ని నగరాల్లో సాదా ఇడ్లీని ఎక్కువగా ఇష్టపడేవారు.