నిత్యం కూలి పని.. క్లీనింగ్ పని చేస్తూ జీవనం సాగించేవాళ్లకి పూట గడవడమే తప్ప ఆస్తులు కూడబెట్టుకోవడం తెలియదు. ఎదైనా సమస్య వస్తే అప్పో సప్పో చేయడమే కానీ మరో గతి ఉండదు. ఆ సమయంలో ఎవరైనా సాయం చేసి ఆదుకుంటే గట్టెక్కడం తప్ప గత్యంతరం లేని బతుకులు వారివి. ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో ఆ తల్లిదండ్రులు ఎంత దూరమైన వెళ్తారు. తమలాగా పిల్లలు బతుకులు ఉండకూడదని సంపాదించిందంతా వాళ్ల చదువుకే ఖర్చుచేస్తారు. అయితే ఎంత చేసినా ఇంకా చేయాల్సిందే కొంతైనా ఉంటుంది. విద్య వ్యాపారంగా మారిన కాలం కదా ఇది. అది వెనకపడ్డ రాష్ట్రాల్లోనైనా, అభివృద్ధికే రోల్మోడల్గా నిలిచే రాష్ట్రాల్లోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది. తన కన్న కొడుకు కాలేజీ ఫీజ్ కొట్టడం కోసం కొంతమంది మాటలు విన్న ఓ తల్లి బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది.
పూర్తిగా చదవండి..Suicide: కొడుకు కాలేజీ ఫీజ్ కట్టడానికి బస్సు కిందపడి తల్లి ఆత్మహత్య.. ఎక్కడో తెలుసా?
కేరళలోని సేలంలో హృదయవిదారక ఘటన జరిగింది. ఓ తల్లి తన కోడుకు ఫీజ్ కట్టడానికి ఓ బస్సు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రూ.45వేలు కావాలంటే బస్సు కింద పడి చనిపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఎవరో చెప్పిన మాయమాటలు నమ్మి ఇలా చేసింది.
Translate this News: